మేడ్చల్/ఘట్కేసర్ రూరల్/కీసర, మార్చి 19 : పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అన్నారు. మండల, జిల్లా పరిషత్లకు ప్రభుత్వం నిధులు కేటాయించిన సందర్భంగా మేడ్చల్, ఘట్కేసర్ మండల పరిషత్ కార్యాలయాల ఆవరణలో గురువారం వేర్వేరుగా ఎంపీపీలు పద్మాజగన్రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ బడ్జెట్లో నిధుల కేటాయింపుతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసిన సీఎం కేసీఆర్కు, ఆర్థిక మంత్రి హరీశ్రావు కు రుణపడి ఉంటామన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ మండల ఎంపీటీసీలు వెంకటేశ్, రఘు, ప్రకాశ్, హేమలత, అంకిత, కో ఆప్షన్ సభ్యురాలు రుక్సానా తదితరులు పాల్గొన్నారు. ఘట్కేసర్లో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కందుల కుమార్, ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు, ఎంపీటీసీ రామారావు, వినోద నాగార్జున తదితరులు పాల్గొన్నారు. కీసర మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీఎం చిత్రపటానికి నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో ఎంపీపీ ఇందిర, ఎంపీడీవో పద్మావతి, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీటీసీ కవిత, జూపల్లి వెంకటేశ్, మండల కో ఆప్షన్ సభ్యులు బషారత్ అలీ, మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నారాయణ, శశికాంత్ పాల్గొన్నారు.