Shambhipur Raju | దుండిగల్, ఏప్రిల్ 12 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లోని కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ తమ ప్రాంతాలలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించాలని విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననీ తెలిపారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరగబోయే శుభ కార్యక్రమాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆయనకు ఆహ్వాన పత్రికలను అందజేశారు.