మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి, శివాలయం నగర్ సమీపంలోని పెద్ద చెరువులో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చెరువులో మృతదేహం తేలియాడుతుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి ఒంటిపై గ్రీన్ బ్లాక్ చెక్స్ షర్టు, బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి వయస్సు 32 నుంచి 36 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.
ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.