డంగల్, డిసెంబర్ 12 : అభివృద్ధికి సహకరించే వారికే ప్రజా మద్దతు ఉంటుందని బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మద్దూర్ మండలం కొమ్మూరు గ్రామ కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమ క్షంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్, కొడంగల్ను దత్తత తీసుకొని అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి కేటీఆర్, ప్రజలకు వెన్నంటి ఉంటున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాలనా దక్షతకు ఆకర్షితులమై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలుపుకునేందుకు తన వంతు పూర్తి సహకారం ఉం టుందని తెలిపారు. పార్టీలో చేరుతున్న ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తానని, అభివృద్ధిని సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో చేరిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్యాలమద్ధి సర్పంచ్ గఫూర్ఉన్నిసా బేగం అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతిచెందారు. ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, సర్పంచ్లు సయ్యద్ అంజద్, పకీ రప్ప, అనిత, భీమమ్మ, సావిత్రమ్మ, గుండలప్ప, విజయమ్మలతో పాటు బొంరాస్పేట సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చాంద్పాషా, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబు, నవాజొద్దీన్ పాల్గొన్నారు.