సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాలను అర్చకులు మంగళవారం తెల్లవారుజామునే పూజలు నిర్వహించి ఉదయం 8 గంటల నుంచే ఆలయాల తలుపులు మూసివేశారు. పునర్దర్శనం బుధవారం ఉదయం సంప్రోక్షణ చేసిన అనంతరం ఉంటుందని పూజారులు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 25 : ఇబ్రహీంపట్నంలోని లక్ష్మీనర్సింహస్వామి, ఈశ్వరాంజనేయస్వామి, త్రిశక్తి దేవాలయాలను ఉదయం నుంచే మూసివేశారు. సూర్యగ్రహణం ప్రభావంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకురాలేదు. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా, ప్రజలులేక వెలవెలబోయింది. అలాగే, సాగర్హ్రదారి కూడా వాహనదారులు లేక నిర్మానుష్యంగా కనిపించింది.
అనంతపద్మనాభస్వామి ఆలయం మూసివేత
వికారాబాద్, అక్టోబర్ 25 : వికారాబాద్ శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 8:30 గంటలకు మూసి వేసినట్లు ఆలయ ఈవో నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ శుద్ధి తరువాత బుధవారం ఉదయం 9 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
చిలుకూరులో..
మొయినాబాద్, అక్టోబర్ 25 : మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఆలయాన్ని యథావిధిగా తెరిచి పూజలు చేసి స్వామి వారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించనున్నారు.
మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం..
కొడంగల్, అక్టోబర్ 25 : కొడంగల్ పట్టణంలోని మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు స్వామి వారికి తెల్లవారుజామునే పూజా కార్యక్రమాలను నిర్వహించి ఉదయం 8గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు.
మైసిగండి వద్ద..
కడ్తాల్, అక్టోబర్ 25 : కడ్తాల్ మండలంలోని ఆలయాలను ఆలయ అర్చకులు, నిర్వాహకులు మూసివేశారు. మైసిగండి మైసమ్మ ఆలయంతోపాటు పలు ఆలయాలను మూసి వేసినట్లు ఆలయ ఈవో స్నేహలత, ఫౌండర్ ట్రస్టీ శిరోలీ తెలిపారు.
షాద్నగర్ పట్టణంలో..
షాద్నగర్టౌన్, అక్టోబర్25: షాద్నగర్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ శివమారుతిగీతా అయ్యప్ప మందిరం, కన్యకాపరమేశ్వరి, చౌడమ్మగుట్ట వీరాంజనేయస్వామి, శ్రీ సాయిబాబా, సత్యనారాయణస్వామి, శ్రీ రామలింగేశ్వరస్వామి, అంబా భవానీ దేవాలయంతో పాటు పలు ఆలయాలను మంగళవారం మూసివేసినట్లు దేవాలయాల అర్చకులు తెలిపారు.
చేవెళ్ల మండల కేంద్రంలో..
చేవెళ్లటౌన్, అక్టోబర్ 25: చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉదయం 9గంటలకు మూసివేశారు. సూర్య గ్రహణం అనంతరం ఆలయ సంప్రోక్షణ చేసి బుధవారం ఉదయం 8గంటలకు స్వామికి పూజలు కొనసాగుతాయని ఆలయ ధర్మకర్త, వామనచారి, శ్రీనాథ్, శ్రీపాదచారి, ఆలయ అర్చకులు, ఈవో శ్రీనివాస్ తెలిపారు.
బండవెల్కిచర్లలో..
కులకచర్ల, అక్టోబర్ 25 : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అర్చకులు మూసివేశారు.
కొత్లాపూర్లోని ఎల్లమ్మదేవాలయం..
తాండూరు రూరల్, అక్టోబరు 25 : తాండూరు మండలం కొత్లాపూర్లోని రేణుకా ఎల్లమ్మదేవాలయాన్ని పూజారులు మూసి వేసినట్లు ఆలయ చైర్మన్ సందీప్రెడ్డి తెలిపారు.