షాద్నగర్టౌన్, నవంబర్ 15 : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని కేశంపేట ఎంపీపీ వై.రవీందర్యాదవ్, బీఆర్ఎస్ యువనాయకుడు వై.మురళీయాదవ్ అన్నారు. షాద్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మాదాసికుర్వ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎమ్మె సంతోష్ నామినేషన్ వేశారు. అయితే సంతోష్ బుధవారం తన నామినేషన్ను ఉపసంహరించుకుని బీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా వారు సంతోష్కు బీఆర్ఎస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అ నంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది యువకులు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్లో చేరికలతో నయా జోష్ నెలకొందన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని ప్రతి గడపకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ గెలు పే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. అభివృద్ధి చేసే వారికి ప ట్టం కట్టాలని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మె జార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎమ్మె ల్యే కృషితోనే షాద్నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధిని సాధించిందని, అంజన్న గెలుపు కో సం సైనికుల్లా పని చేస్తామని ఈ సందర్భంగా పా ర్టీలో చేరిన ఎమ్మె సంతోష్, మాదాసికుర్వ నాయకుడు జగన్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రామకృష్ణ, నాయకులు మన్నె నారాయణ, కడెంపల్లి శ్రీనివాస్, అశోక్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
షాద్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతు ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్కు తెలుపుతున్నానని టీడీ పీ సీనియర్ నాయకుడు మఠం శశిధర్ తెలిపా రు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ యన తన నామినేషన్ను ఉపసంహరించుకుని ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతున్నట్లు బుధవారం తెలిపారు. అంజన్న గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు. షాద్నగర్ మరింత అభివృద్ధిని సాధించాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే మరో స్వతంత్ర అభ్యర్థి శ్రీరంగపూర్ సత్యనారాయణరెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకుని బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు.
బీఆర్ఎస్కు పలువురు నాయకులు మద్దతు తెలుపడంతో బీఆర్ఎస్ గెలుపునకు ఎదురులేదని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేకు మద్దతు తెలిపిన మఠం శశిధర్ను నాయకులు శాలువాతో సన్మానించారు. నామినేషన్ ఉపసంహరణలలో కీలక పాత్ర పో షించిన వీర్లపల్లి సంగయ్యగౌడ్ను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీటీసీ రామకృష్ణ, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్రెడ్డి, నాయకులు మన్నె నారాయణ, కడెంపల్లి శ్రీనివాస్, రంజినీకాంత్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.