దౌల్తాబాద్ డిసెంబర్ 8: పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని గోకాఫసల్వాద్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు రెడ్డి శ్రీని వాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరుతున్న ఆయా పార్టీల నాయకులకు, కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి, కార్యకర్తల అభ్యున్నతికి ఎల్లప్పుడూ పాటుపడతానన్నారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా ఆ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలిపారు. గతంలో రేవంత్రెడ్డిని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించ కుండా స్వలాభం కోసమే పాటుపడుతూ కొడంగల్ ప్రజలను మోసం చేసినట్లు ఆరోపిం చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అనునిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొంటూ వాటిని పరిష్కరిస్తున్నాడని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టతకు పాటుపడతామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోట్ల మహిపాల్, మాజీ జడ్పీటీసీ పకీరప్పతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమిపూజ
కొడంగల్, డిసెంబర్ 8: కొడంగల్లో అయ్యప్ప ఆలయ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కోరడంతో పట్టణంలోని బండల ఎల్లమ్మ దేవాలయ ప్రాంతంలో ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి అయ్యప్ప భక్తులు గురువారం భూమి పూజ నిర్వహించారు. అర్చకులు కిట్టుస్వామి ఆలయ నిర్మాణ ప్రాంగణాన్ని శుద్ధి చేసి పూజను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. మణికంఠుడి ఆలయాన్ని పూర్తి శాస్ర్తోక్తతంగా నిర్మాణం చేపట్టేవిధంగా ప్రణాళిక చేసినట్లు డా.రవీంద్రయాదవ్, ఉమాపతిగౌడ్, శ్రీనివాస్ గౌడ్లు తెలిపారు.
ఆలయ నిర్మాణానికి రూ.కోటి నిధులు వ్య యం కావచ్చనే అంచనా ఉందని, ఇందుకు గాను కొందరు దాతలు ముందుకు వచ్చినట్లు తెలిపారు. అదే విధంగా భక్తులు చందాలు ఇస్తున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూన్రావు యాదవ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, రావులపల్లి సర్పంచ్ రమేశ్రెడ్డి, డాక్టర్ సాకేత్, అయ్యప్పలు నందారం రాజు, బుక్క రాజు, బుక్క విజయ్కుమార్, గోపాల్, మధు, నరేష్తో పాటు భక్తులు శ్రీనివాస్, ఆనంద్లాహోటీ, నందారం రత్నం, రాజు, నర్సిరెడ్డి, నందారం ఓంప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
బాధితుడికి నిమ్స్లో వైద్యం అందిస్తా
మున్సిపల్ పరిధిలోని కార్గిల్ కాలనీలో విద్యుత్ తీగల వల్ల ఇప్పటి వరకు నలుగురు ప్రమాదానికి గురైనట్లు కాలనీ వాసులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దృష్టికి తీసుకొ చ్చారు. గురువారం షమీం అనే యువకుడు తన ఇంటికి పెయింటిగ్ పనులు నిర్వహి స్తుం డగా ప్రమాద వశాత్తు ఇంటికి ఆనుకొని ఉన్న 133కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలతో ప్రమాదం సంభవించింది. బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిం చారు. ప్రమాద ఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే కార్గిల్ కాలనీకి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిమ్స్ దవాఖానలో చేర్పించి వైద్యసేవలు అందించనున్నట్లు ధైర్యాన్ని చెప్పారు. అలాగే తీగలను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావు యాదవ్, జడ్పీమాజీ వైస్ చైర్మన్ కృష్ణ, కోఆప్షన్ సభ్యులు మునీర్, సర్పంచ్లు చాంద్పాషా, పకీరప్ప, మాజీ సర్పంచ్ రమేష్బాబుతో పాటు టీఆర్ఎస్ నాయకులు నరోత్త రెడ్డి, నవాజొద్దీన్, చంద్రప్రకాశ్ ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పంపిణీ
బొంరాస్పేట, డిసెంబర్ 8 : మండలంలోని ఏర్పుమళ్ల గ్రామానికి చెందిన వెంకటయ్యకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల ఎల్వోసిని గురువారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుం బాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారన్నారు. ఎల్వోసీ మంజూరు కావడం పట్ల బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.