తుర్కయాంజాల్, నవంబర్ 5 : రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని సూరజ్ నగర్ కాలనీ, శ్రీ గణేశ్ శ్రీనివాస రంగపురం కాలనీలో కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో రూ.2931 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్దే అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, నాయకులు జక్కా రాంరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, నర్సింహారెడ్డి, చిన్నయ్య, రాగన్నగూడ మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి, బద్దం వెంకట్రెడ్డి, మర్రి మహేందర్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు అశ్విని పాల్గొన్నారు.
ఆదిబట్ల : బీఆర్ఎస్ పాలనలో కొంగరకలాన్ ప్రాంతం రూపురేఖలు మారుతున్నాయని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి మద్దతుగా కొంగరకలాన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టుబట్టి కలెక్టర్ కార్యాలయాన్ని కొంగరకలాన్ కు తీసుకువచ్చి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డికి ఈ ప్రాంత ప్రజలు అండగా ఉండాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు మహేందర్, వనం శ్రీను, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి, నాయకులు ముక్కెర నారాయణ, ఉడుతల వీరస్వామిగౌడ్, చింతాకుల శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, కృపాకర్, నర్సగళ్ల ప్రవీణ్, కాకి మహేందర్, విద్యాసాగర్, మధు, సంతోష్, సుమన్, పవన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం తొర్రూర్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలను నమ్మవద్దన్నారు. అదేవిధంగా తుర్కయాంజాల్లో యువజన విభాగం మున్సిపాలిటీ అధ్యక్షుడు కార్తీక్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిచారు. కార్యక్రమంలో యాదయ్య, బాలకృష్ణ, శ్రీనివాస్, దశరథ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్గౌడ్, యాదిరెడ్డి, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మండలంలోని రాయపోల్, ముకునూరు, కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం, ఉప్పరిగూడ, దండుమైలారం, పోల్కంపల్లి, నాగన్పల్లి, నెర్రపల్లి గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ కృపేశ్ పాల్గొన్నారు.
మంచాల : మండలంలోని కాగజ్ఘాట్, ఆగపల్లి, ఆరుట్ల గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆండాళు, వెంకటేశ్, భిక్షపతి, జంగయ్య యాదవ్, శ్రీశైలం, శేఖర్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 24వ వార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి మద్దతుగా మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు నీలం శ్వేత, మమత, మంగ, పద్మ, శ్రీలత, విశాల, ప్రసన్నలక్ష్మి, మంద సుధాకర్, సుజాత, జగన్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
యాచారం : మండలంలో రోజురోజుకూ బీఆర్ఎస్ ప్రచారం రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతున్నది. ప్రతి పక్షాలను తలదన్నేలా దూసుకుపోతున్నది. మండలంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. మల్కీజ్గూడ, మేడిపల్లి, నల్లవెల్లి, మంథన్గౌరెల్లి, యాచారం తదితర గ్రామాలలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ నాయకులు ప్రచారం కొనసాగించారు. కార్యక్రమంలో వడ్డెమోని కిషన్, మక్కపల్లి శ్రీనివాస్, బోడ కృష్ణ, దోస మహేశ్, బోడ అబ్బయ్య, కొలన్ అనంతరెడ్డి, డేరంగుల శంకర్, జిల్లా రాములు, పాలకుర్ల లక్ష్మీపతి, మారోజు శ్రీనివాస్, మహ్మద్ ఖాజా తదితరులున్నారు.