మంచాల : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నంలో రూ. 32 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు నిర్వహించే బహిరంగ సభకు బుధవారం మంచాల మండలం వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఐదు వందల బైకులతో మంచాలలో ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ నిర్వహించిన అనంతరం బహిరంగ సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు చీరాల రమేశ్, వనపర్థి బద్రినాథ్ గుప్తా, ఎండీ జానీపాషాతో పాటు నాయకులు పాల్గొన్నారు.