కడ్తాల్, నవంబర్ 1: రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయ ఉత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. భక్తుల కోర్కెలు తీరుస్తూ.. ఈ ప్రాంతవాసులకు అమ్మవారు కొంగు బంగారంగా నిలిచారు. ఎనిమిది రోజులపాటు జరుగనున్న ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తిక మాసంలో జరుగనున్న ఈ జాతరకు జిల్లావాసులే కాకుం డా హైదరాబాద్, మహబూబ్నగర్, వికారాబాద్, వనపర్తి, మేడ్చల్, నాగర్కర్నూల్, మెదక్, ఉమ్మడి నల్గొండ తదితర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రకరకాల పూలు, మామిడి, కొబ్బరి తోరణాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. అలాగే మైసమ్మ ఆలయ సమీపంలోని శివాలయం, రామాలయం వద్ద కూడా ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆలయ ఆవరణలోని కోనేరు నీటితో నిండి భక్తులకు కనువిందు చేస్తున్నది.
జాతర కార్యక్రమాల వివరాలు..
ఈ నెల 8న ఆలయ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, మహానివేదన అనంతరం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత, 9న క్షీరాభిషేకం, విశేష అలంకరణ, కుంభహారతి, 10న శతచండీ హోమం ప్రారంభం, రాత్రికి పుష్పరథోత్సవం, 11న శతచండీ హో మం, విశేష పూజలు, 12న శతచండీహోమం, పూర్ణాహుతి, రాత్రికి రథోత్సవం, 13న అమ్మవారికి బోనాలు, బండ్లు తిప్పుట, 14న విశేషపూజలు, అర్చనలు, 15న వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి అలంకరణ, ప్రత్యేకపూ జా కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు.
జాతరకు ఏర్పాట్లు చేస్తున్నాం..
మైసిగండి మైసమ్మ తల్లి జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎనిమిది రోజులపాటు జరుగనున్న ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యం లో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తు న్నాం. ఆలయ ఆవరణలో వసతులు, ప్రత్యే క క్యూలైన్లను ఏర్పా టు చేస్తున్నాం.
-శిరోలీపంతూనాయక్, ట్రస్ట్ చైర్మన్, మైసమ్మ తల్లి ఆలయం
వసతులు కల్పిస్తున్నాం
మైసమ్మతల్లి జాతరను వైభవంగా నిర్వహిస్తాం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని వసతులను కల్పిస్తాం. ఆలయాన్ని పూలు, మా మిడి తోరణాలతో సుందరంగా ముస్తాబు చే స్తాం. ఇప్పటికే పనులు ప్రారం భ మయ్యాయి.
-స్నేహలత, ఈవో,మైసిగండి మైసమ్మ ఆలయం