అమీర్పేట్, జనవరి 27 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అయిదు రోజుల పాటు జరుగనున్న శతచండి యాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆలయ వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వెంకటరమణ శర్మ, రామనాథ శర్మ, రాజీవదత్త తదితరులు శతచండీ యాగ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ఈవో కుంట నాగరాజు, చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్ కోరారు.