అబ్దుల్లాపూర్మెట్, జూన్ 23 : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో శ్రీ వాసవీసాయి, శ్రీ భూనీళాసమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
గురువారం వీటితో పాటు నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై పూజలు చేశారు.