రంగారెడ్డి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): లోక్ సభ ఎన్నికలకు సంబంధించి గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అనంతరం జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
బి.వెంకట్మ్రేశ్బాబు(సోషలిస్టు ఇండియా పార్టీ), మహ్మద్ ముస్తఫా రిజ్వాన్(స్వతంత్ర అభ్యర్థి), పాలమాకుల మధు(ఇండియా ప్రజా బంధు పార్టీ)లు ఒక్కొక్క నామినేషన్ చొప్పున మూడు నామినేషన్లు దాఖలు చేశారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.