పంచమి తిథి శుభ ముహూర్తాన సీఎం కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వడంతో పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. తమ అభిమాన ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పటాకులు కాల్చి, స్వీట్లను పంచిపెట్టడంతో పాటు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మళ్లీ అధికారంలోకి మనమే.. హ్యాట్రిక్ ఖాయం.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ప్రతిపక్షాల ఊహాగానాలకు సీఎం కేసీఆర్ తెరదించారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వల్ల విస్తృత ప్రచారానికి తగిన సమయం దొరకనుండడంతోపాటు ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడుతాయని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు, మేధావులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా కదనరంగంలోకి దిగేందుకు ఎమ్మెల్యేలు సై అంటూ గులాబీ దళానికి పిలుపునిచ్చారు.
రంగారెడ్డి, ఆగస్టు 21 (నమస్తే తెలంగా ణ) : తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్ర మంలో ఎన్నికలకు మూడు నెలల ముం దుగానే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. జిల్లాలో పాత వారికే మరోసారి అవకాశం కల్పించారు. జిల్లా మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గానికి ఈసారి కూడా ఆమె అభ్యర్థిత్వానే ఖరారు చేశారు. అలాగే ప్ర స్తుతం ఇబ్రహీంపట్నం నియోజకవర్గాని కి మంచిరెడ్డి కిషన్రెడ్డి, షాద్నగర్కు అం జయ్యయాదవ్, చేవెళ్లకు కాలె యాద య్య, కల్వకురిక్తి జైపాల్యాదవ్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి కూడా వారే ఆయా స్థానాల నుంచే ఎన్నికల బరి లో ఉంటున్నారు. అభ్యర్థుల ప్రకటనతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సంబురాలు మిన్నంటాయి. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని బీఆర్ఎస్ శ్రేణులు సంతోషాన్ని పంచుకున్నాయి.
హ్యాట్రిక్ దిశగా..
పంచమి తిథి శుభ ముహూర్తాన సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఒకే జాబితాలో ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. 2018 ముందస్తు ఎన్నికల సందర్భంలోనూ ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. శాసనసభ ఎన్నికలు డిసెంబర్లో జరిగే అవకాశాలుండడంతో మూడు నెలల ముం దుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్ష పార్టీలను ఆశ్చర్యపర్చేలా చేశారు. కొంతకాలంగా నిర్వహించిన సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల గెలుపుపై నమ్మకం కుదరడంతో వారికే ఈ సారి కూడా అవకాశం కల్పించారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించ డంతో విస్తృత ప్రచారానికి తగిన సమయం దొరకనుండడంతోపాటు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేసేందుకు అవసరమైన వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం పరంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా ఎమ్మెల్యేలు ప్రజల మధ్యనే ఉంటూ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యులవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు సైతం ఈజీ అవుతుందంటున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డిపై 376 ఓట్లతో గెలుపొందారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తల్లోజు ఆచారిపై 3,447 ఓట్ల మెజార్టీతో, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నంపై 33,552 ఓట్లతో, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రతాప్రెడ్డిపై 20,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హ్యాట్రిక్ ప్రభుత్వంలో తమవంతు పాత్ర పోషించే దిశగా జిల్లా కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈసారి ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు.
అంబరాన్నంటిన సంబురాలు..
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం ప్రకటించడంతో జిల్లాలో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. తమ అభిమాన ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఖరారు కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పటాకులు కాల్చి, స్వీట్లను చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. హ్యాట్రిక్ ఖాయమంటూ నినాదాలు చేశారు. అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ఎన్నికల్లో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.
సిట్టింగ్లకే మరో చాన్స్..
వికారాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు రాష్ట్ర సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెరదించారు. ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒం టరి పోరుకే సిద్ధమైన అధినేత అన్ని పార్టీల కంటే ముం దుగానే ఏకంగా 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. దీం తో నేటి నుంచే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మరోసారి సిట్టింగ్లనే అభ్యర్థులుగా ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లోని సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
వికారాబాద్ అభ్యర్థిగా మెతుకు ఆనంద్..
వికారాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ మెతుకు ఆనంద్కు మరోసారి అవకాశమిచ్చారు. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ను పొందిన ఆయన ఈ దఫా కూడా వికారాబాద్ అభ్యర్థిగానే బరిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి సీఎం దృష్టిని ఆకర్షించారు. మీతో నేను కార్యక్రమంతో నేరుగా ప్రజల్లోకెళ్లి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎన్నడూలేని విధంగా రూ.వందల కోట్ల నిధులు తీసుకొచ్చారు. నియోజకవర్గానికే తలమానికంగా నిలవనున్న మొబిలిటీ వ్యాలీని మోమిన్పేటలో ఏర్పాటయ్యేలా కృషి చేశారు. జిల్లా కేంద్రంలోని బ్రిడ్జి నిర్మా ణం విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ.96 కోట్లను మంజూరు చేయించారు.
తాండూరు అభ్యర్థిగా పైలట్ రోహిత్రెడ్డి
తాండూరు నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికే టికెట్ను మరోసారి ఖరారు చేశారు బీఆర్పార్టీ అధినేత కేసీఆర్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని.. బీజేపీ బాగోతాన్ని బయటపెట్టి హీరోగా మారిన రోహిత్రోడ్డినే తాండూరు అభ్యర్థిగా బరిలోకి దింపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషిచేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలను తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
కొడంగల్ అభ్యర్థిగా పి.నరేందర్రెడ్డి
కొడంగల్ నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డినే పార్టీ ప్రకటించింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడించడంతో మరోసారి కూడా పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలో నిలిపారు. గతంలో రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి 2007, 2015లో రెండుసార్లు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలో పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతోపాటు.. ప్రజలకు అందుబాటులో ఉండటంతో పార్టీ ఆయనవైపే మొగ్గు చూపింది.
పరిగి నుంచి కొప్పుల మహేశ్ రెడ్డి
పరిగి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని మరోసారి ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ నిలిపింది. పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి కుమారుడిగా గత ఎన్నికల్లో పరి గి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. గత ఐదేండ్లుగా నియోజకవర్గ మంతటా పల్లెబాట కార్యక్రమం పేరిట ఊరూరా పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులను తీసుకొచ్చారు.
అభ్యర్థి పేరు : మంచిరెడ్డి కిషన్రెడ్డి
నియోజకవర్గం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
తండ్రి పేరు : మంచిరెడ్డి భూపాల్రెడ్డి
తల్లి పేరు : మంచిరెడ్డి పద్మమ్మ
భార్య పేరు : మంచిరెడ్డి ముకుందమ్మ
కుమారులు : వెంకటేశ్వర్రెడ్డి, ప్రశాంత్కుమార్రెడ్డి
కుమార్తె : శీతల్
పుట్టిన తేదీ : 11-04-1953
అడ్రస్ : ఇంటినంబర్ 2-105 గ్రామం ఎలిమినేడు, మండలం ఇబ్రహీంపట్నం, రంగారెడ్డిజిల్లా
విద్యార్హతలు : బీఏ
హాబీలు : వ్యాపారం, సోషల్సర్వీస్. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు
నిర్వహించిన పదవులు..
1980-85 వరకు ఎలిమినేడు గ్రామ సర్పంచ్గా..
1985-90 వరకు ఎలిమినేడు సహకారసంఘం చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్
1994-96 వరకు టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి
2002-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీఐడీసీ చైర్మన్
1997-2004 వరకు టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
2009-2014 వరకు టీడీపీ నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఎన్నిక
2014-2018 వరకు టీడీపీ నుంచి రెండోసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక
2018 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ప్రజలు మరోసారి ప్రగతికే పట్టం కడతారు
రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతికే ప్రజలు మరోసారి పట్టం కడతారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయం. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లను గెలువడంతోపాటు సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం. నియోజకవర్గంలో గత 15 ఏం డ్లుగా ప్రజాసేవలో తరిస్తున్నా. రాను న్న ఐదేండ్ల వరకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించి న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా. తన పనితీరుపై ప్రజలు ఎంతో సం తృప్తిగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని భావి స్తున్నా. రంగారెడ్డి జిల్లా అభ్యున్నతికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ఎంతో కృషి చేస్తున్నారు. అనేక పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువ తకు ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు జిల్లాను ప్రపంచ పటంలో నిలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. -మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
అభ్యర్థి పేరు : అంజయ్యయాదవ్
: బాలకిష్టమ్మ, ఆగయ్యయాదవ్
పుట్టిన తేదీ: మే 10
గ్రామం : ఎక్లాస్ఖాన్పేట, మండలం: కేశంపేట
భార్య: లక్ష్మమ్మ(గృహిణి)
విద్యార్హత : బీఎస్సీ(ఎంపీసీ)
సంతానం : ఇద్దరు కుమారులు
పెద్ద కుమారుడు : రవీందర్యాదవ్ (వ్యాపారి, కేశంపేట ఎంపీపీ )
చిన్న కుమారుడు : మురళీకృష్ణ(సాఫ్ట్వేర్ ఉద్యోగి)
పెద్ద కోడలు : కవిత (ఎక్లాస్ఖాన్పేట సర్పంచ్ )
చిన్న కోడలు : హిమబిందు(సాఫ్ట్వేర్ ఉద్యోగి)
రాజకీయ నేపథ్యం : 1987లో కేశంపేట ఎంపీపీ, 2001లో బీఆర్ఎస్లో చేరిక, 2001లో బీఆర్ఎస్ జడ్పీటీసీగా ఎన్నిక, 2001 నుంచి 2006 వరకు జడ్పీ బీఆర్ఎస్ ఫ్లోర్లీడర్, 2006 నుంచి 2014 వరకు బీఆర్ఎస్ తాలూకా ఇన్చార్జి, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఓటమి, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 17వేల పైచిలుకు మెజార్టీతో గెలుపు, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్రెడ్డిపై 20 వేల కు పైగా గెలుపు.
సీఎం నమ్మకాన్ని నిలబెడుతా
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది. గత మూడు పర్యాయాలుగా టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లోనూ పార్టీ టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరం. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదంతో కచ్చితంగా గెలుస్తా. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల నిధులను తీసుకొచ్చా. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తా. పార్టీ టికెట్ కేటాయించినందుకు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
-అంజయ్యయాదవ్, షాద్నగర్ ఎమ్మెల్యే
అభ్యర్థి పేరు : కాలె యాదయ్య
తండ్రి పేరు : మల్లయ్య
వయస్సు : 61 ఏండ్లు
జన్మస్థలం : చించల్పేట్
కులం : ఎస్సీ మాదిగ
విద్యార్హతలు : బీఏ
వృత్తి : వ్యవసాయం
అసెంబ్లీ నియోజకవర్గం : చేవెళ్ల
గతంలో చేపట్టిన పదవులు
1) 1992 నుంచి 1996 వరకు సింగిల్ విండో చైర్మన్ చించల్పేట్
2) 1992 నుంచి 1995 వరకు డీసీఏంఎస్ డైరెక్టర్
3) 1993 నుంచి 1996 వరకు జిల్లా గ్రంథాలయ
సంస్థ డైరెక్టర్
4) 1995 నుంచి 2000 వరకు నవాబుపేట జడ్పీటీసీ
5) 2001నుంచి 2006 వరకు నవాబుపేట ఎంపీపీ
6) 2008 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు మెంబర్
7) 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిచి కొనసాగుతున్నారు.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు
చేవెళ్ల ఎమ్మెల్యేగా మూడోసారి పేదలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. గత 70 ఏండ్ల కాలంలో ఏ సీఎంలు, ఏ ప్రభుత్వాలు అమలు చేయని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో గత తొమ్మిదేండ్ల కాలంలో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగింది. షాబాద్, శంకర్పల్లి మం డలాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావడం తో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయి. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో విజయం సాధించి గులాబీ జెండా ను ఎగురవేస్తా. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం
-కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
పూర్తి పేరు : గుర్క జైపాల్యాదవ్, భార్య పేరు : గుర్క రాజ్యందేవి
తండ్రి పేరు : గుర్క బలరాం యాదవ్, తల్లి పేరు : గుర్క మంగమ్మ.
కుమారుడు : రమేశ్, కుమార్తెలు : సంగీత, జ్యోతి, వాణి
పుట్టిన తేదీ : 25-8-1954, గ్రామం: చల్లంపల్లి, విద్యాభ్యాసం : గ్రాడ్యుయేట్
రాజకీయ ప్రస్థానం
1 చల్లంపల్లి గ్రామ సర్పంచ్గా రెండుసార్లు (1981-1991)
2 తలకొండపల్లి జడ్పీటీసీ (1995-2000)
3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ( 1997-1999)
4. కల్వకుర్తి ఎమ్మెల్యేగా టీడీపీ నుం చిమొదటి సారిగా గెలుపు ( 1999-2004)
5. వంగూర్ జడ్పీటీసీ (2006)
5. కల్వకుర్తి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి రెండోసారి గెలుపు ( 2009-2014)
6. కల్వకుర్తి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి మూడోసారి గెలుపు (2018ప్రస్తుతం )
చాలా సంతోషకరం..
సీఎం కేసీఆర్ నమ్మకంతో మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషకరం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తా. అంతేకాకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అం దేలా చర్యలు తీసుకుంటా. అందరికీ అందుబాటులో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా.
అభ్యర్థి పేరు : డాక్టర్ మెతుకు ఆనంద్
పుట్టిన తేదీ : జూన్ 4, 1974, కెరెళ్లి, ధారూరు మండలం, వికారాబాద్
తల్లిదండ్రులు : పోచమ్మ, సాయన్న, సతీమణి : డాక్టర్ సబిత
సంతానం : కుమార్తె వినూత్న, కుమారుడు వైభవ్, నివాసం : వికారాబాద్
విద్యార్హత : ఎంబీబీఎస్, ఎండీ, (ఓబీజీ),ఎంఎస్, (జనరల్ సర్జర్)
వృత్తి : భార్యాభర్తలు ఇద్దరూ వైద్యులే, రిజర్వేషన్ : ఎస్సీ
చేపట్టిన పదవులు
1)కొంతకాలం వైద్యుల ఐకాస అధ్యక్షుడిగా ఉన్నారు. 2) ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు
3) 2013-14లో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు.
4) 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్కుమార్పై 3,526 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
5) జనవరి 26న బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తా
సిట్టింగ్ ఎమ్మెల్యేలనే పార్టీ అభ్యర్థులుగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి వికారాబాద్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించిన, రాజకీయ గురువు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డిలకు ధన్యవాదాలు. అధిష్ఠానం ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమన్వ యం చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయకేతనం ఎగరవేస్తా. -డాక్టర్ మెతుకు ఆనంద్ , వికారాబాద్ ఎమ్మెల్యే
అభ్యర్థి పేరు : పట్నం నరేందర్రెడ్డి
పుట్టిన తేదీ : 22-01-1970.(గొల్లూర్గూడ, షాబాద్ మండలం)
తండ్రి పేరు : పట్నం మల్లారెడ్డి, తల్లి పేరు : పట్నం రుక్కమ్మ, భార్య పేరు: పట్నం శ్రుతి
కుమారుడు : హితీశ్రెడ్డి, కుమార్తెలు: దీక్ష, ఉపేక్ష (కవలలు) చదువు : బీఎస్సీ అగ్రికల్చర్
రాజకీయ ప్రభావం: పట్లోళ్ల ఇంద్రారెడ్డి (మేనమామ), ఎన్టీఆర్, పట్నం మహేందర్రెడ్డి (సోదరుడు).
1) 1994 నుంచి 2006 పీఏసీఎస్ చైర్మన్ తాళ్లపల్లి
2) 2006 నుంచి 2008 ఎంపీపీ షాబాద్
3) 2010 మే నుంచి 2015 ఎమ్మెల్సీ (ఏపీ స్థానిక సంస్థలు) రంగారెడ్డిజిల్లా
4) 2015 నుంచి 2018 ఎమ్మెల్సీ (రెండోసారి)
5) 2018లో కొడంగల్ ఎమ్మెల్యేగా ప్రత్యర్థి రేవంత్రెడ్డిపై ఘన విజయం
రాజకీయ పదవులు..
1) 1996 నుంచి 2002 తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, షాబాద్
2) 2002 నుంచి 2004 టీడీపీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు
3) 2005 నుంచి 2007 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
4) 2008లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
5) 2008లోతెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు
ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు
రెండోసారి కూడా పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞత లు. గత ఎన్నికల్లో గెలుపొంది ప్ర భుత్వం నుంచి అధికంగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాభివృద్ధికి కృషి చేశా. కొడంగల్ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ ప్రోత్సాహం ఎంతో ఉన్నది. గెలిచినప్పటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉం టూ సమస్యలను పరిష్కరిస్తున్నా. సెగ్మెంట్లోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడంతోపాటు ప్రజలకు అండగా ఉన్నా. ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుండడంతో ఈసారి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోపాటు సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే వారికి అందుబాటులో ఉంటూ సంక్షేమానికి పాటుపడతా..
అభ్యర్థి పేరు : కొప్పుల మహేశ్రెడ్డి
తండ్రి పేరు : కొప్పుల హరీశ్వర్రెడ్డి
(అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్)
పుట్టిన తేదీ : 05-02-1973, భార్యపేరు : ప్రతిమారెడ్డి, కుమారుడు : వర్షిత్రెడ్డి, కుమార్తె : వినీషారెడ్డి,
విద్యార్హత : ఇంటర్మీడియట్, నియోజకవర్గం : పరిగి
2018 వరకు జిల్లా రైతు సమన్వయ సమితి
కో-ఆర్డినేటర్గా పనిచేశారు.
2018లో పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం
పరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా పేరును ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. 2018లో మొదటిసారి పార్టీ తరఫున పోటీ చేసి నియోజకవర్గ ప్రజల మద్దతుతో గెలుపొంది.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నా. గెలిచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందేలా చర్యలు తీసుకుంటున్నా. ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వానే కోరుకుంటున్నారు. ఈసారి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోపాటు సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం. ప్రజలు మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
అభ్యర్థి పేరు : పంజుగుల రోహిత్రెడ్డి
తండ్రి పేరు : విఠల్రెడ్డి, తల్లి పేరు : ప్రమోదినీదేవి
భార్య పేరు : ఆర్తిరెడ్డి, కుమార్తె పేరు : నక్షత్రారెడ్డి
కుమారుడి పేరు : జైదేవ్రెడ్డి
పుట్టిన తేదీ : 7 జూన్ 1984
విద్యార్హత : ఎంఎస్ ఇంజినీరింగ్
50 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తాం
బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు . సీఎం ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో 50 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తా. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితోపాటు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతల అభిమానం, ఆశీర్వాదం నాకు పుష్కలంగా ఉన్నది. దాంతోనే రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిం చి నియోజకవర్గాభివృద్ధికి మరింత కృషి చేస్తా. ఇప్పటికే సెగ్మెంట్ కోట్లాది రూపాయాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టా. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లా.
– రోహిత్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే
మంత్రి సబితా ఇంద్రారెడ్డి బయోడేటా
పేరు : పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డి
భర్త పేరు : పట్లోళ్ళ ఇంద్రారెడ్డి(లేట్), మాజీ హోంమంత్రి
పుట్టిన తేదీ : 05.05.1963
సంతానం : ముగ్గురు కుమారులు కార్త్తిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కల్యాణ్రెడ్డి
విద్యార్హత : గ్రాడ్యుయేషన్(బిఎస్సీ)
రాజకీయ నేపథ్యం : 2004లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలు పొందారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో
గనులశాఖ మంత్రిగా కొనసాగి ఐటీ, చేనేత, జౌళి శాఖలకు మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో
మహే శ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది హోం, జైళ్ల శాఖల మంత్రిగా పనిచేశారు. 2018లో
మహేశ్వరం నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2019లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం
తెలంగాణ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.