ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా
ఇబ్రహీంపట్నం, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేదల నడ్డి విరుస్తున్నదన్నారు. కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. బీజేపీ నాయకులు సిగ్గులేకుండా రైతులను మోసంచేసే మాటలు మాట్లాడటం ఎంత వరకు సమంజసమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందించిన గొప్ప నాయకుడన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, సత్తువెంకటరమణారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీని గద్దెదింపే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, సత్తువెంకటరమణారెడ్డి, రైతుబంధు జిల్లా కన్వీనర్ వంగేటి లక్ష్మారెడ్డి, నోముల కృష్ణగౌడ్, డీసీసీబీ వైస్చైర్మన్ సత్తయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్గౌడ్, రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, మున్సిపాలిటీల అధ్యక్షులు వెంకట్రెడ్డి, జంగయ్య, కృష్ణారెడ్డి, ఉద్యమ సంగీత రచయిత చంద్రప్రకాశ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, సహకార సంఘం చైర్మన్లు వెంకట్రెడ్డి, మహేందర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, పుల్లారెడ్డి, నాయకులు జెర్కోని రాజు, జంగయ్య, బాష, విజయ్కుమార్, ప్రసాద్, రాజ్కుమార్, శివసాయి, ప్రవీణ్, గణేశ్, సాయి, జానిపాషా, విజయ్ పాల్గొన్నారు.
భేషరతుగా ధ్యానం కొనుగోలు చేయాలి
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా భేషరతుగా వరి ధాన్యం కోనుగోలు చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ డిమాండ్ చేశారు. ఆమనగల్లు బ్లాక్ మండలాల కేంద్రాల్లో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. రైతు ధర్నాకు ఆయా మండలాల్లో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చి ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గులలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై చూపుతున్న వివక్షతను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే టీఆర్ఎస్ తరఫున ఆందోళనను విస్తృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయా మండలాల్లో తహసీల్దార్లకు నేతలు వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అర్జున్రావు, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరియాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నిట్టనారాయణ, సింగిల్విండో వైస్ చైర్మన్ సత్యం, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచులు శ్రీనయ్య, కౌన్సిలర్ రాధమ్మ, లాయక్ అలీ, కడ్తాల్ మండలంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్, సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, హరిచందర్, భారతమ్మ, సులోచన, ఎంపీటీసీలు, గోపాల్, లచ్చీరాంనాయక్, మంజుల, ప్రియ, ఉప సర్పంచ్ రామకృష్ణ, మాడ్గుల మండలంలో మండలాధ్యక్షుడు జైపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్నాయక్, డైరెక్టర్ సుభాష్, నిరంజన్, నాయకులు రవితేజ, తిరుమల్రెడ్డి, ఎంపీటీసీ బ్రహ్మం, సుధీర్, వరుణ్, భూపతిరెడ్డి, తలకొండపల్లి మండలంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
ధర్నాకు తరలిన నాయకులు, కార్యకర్తలు
అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే రైతు ధర్నాకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిషన్గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా కిషన్గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ మండలాధ్యక్షుడు చక్రవర్తిగౌడ్, మండల ప్రధానకార్యదర్శి వెంకట్రెడ్డి, యువత అధ్యక్షుడు వినయ్రెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు పాండు, నాయకులు రమేశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, మహేందర్గౌడ్, రాజేశ్ పాల్గొన్నారు.