వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని అనంతగిరి పల్లి సమీపంలోని తేజ కన్వెన్షన్ హాల్లో విజయ గర్జన సన్నాహాక సమావేశం నిర్వహించారు. రెండు రోజుల క్రితం రామయ్యగూడ కౌన్సిలర్ ఆర్. నర్సింలు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ నవంబరు 15న వరంగల్లో జరిగే తెలంగాణ విజయ గర్జన సభకు వికారాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని అన్నారు.
కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ధారూరు జడ్పీటీసీ సుజాత, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్రెడ్డి, హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రమేశ్, సంతోష్కుమార్, వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల టీఆర్ఎస్ అధ్యక్షుడు, కార్యదర్శులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.