అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 20 : ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, ప్రధానకార్యదర్శి కోట వెంకట్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ బూత్స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. మండల కేంద్రంలో నూతన పోలీస్స్టేషన్, రెవెన్యూ కార్యాలయం ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో మండల పరిషత్ కార్యాలయాన్ని తీసుకొస్తామని తెలిపారు.
ప్రతిపక్షాల దిమ్మెతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. నియోజకవర్గం మరింత అభివృద్ది సాధించాలంటే మరోసారి బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బాటసింగారం రైతు సేవా సహకారం సంఘం చైర్మన్ విఠల్రెడ్డి, నాయకులు రాంరెడ్డి, బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు చక్రవర్తిగౌడ్, సర్పంచ్లు కిరణ్కుమార్గౌడ్, ఎంపీటీసీలు సీక సాయికుమార్గౌడ్, వెంకటేశ్యాదవ్, నాయకులు మహేందర్గౌడ్, యాదగిరి, యాదయ్యగౌడ్, గౌరీశంకర్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మారెడ్డి, జీవన్కుమార్రెడ్డి, రాజారాంచారి, శ్రీశైలంగౌడ్, జంగయ్య, చెరుకు భాస్కర్గౌడ్, శేఖర్, పాండు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారెడ్డి తిరుమల్రెడ్డి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు 80 మంది నాయకులు, కార్యకర్తలు చేరారు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజారాంచారి, గ్రామశాఖ అధ్యక్షుడు మహేందర్ముదిరాజ్, నాయకులు జంగయ్యగౌడ్, శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు.