మొయినాబాద్ : అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పంచాయతీ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గత రెండు రోజులుగా మండలంలో అక్రమ నిర్మాణాలను కూల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బుధవారం చిలుకూరు, శ్రీరాంనగర్, మూర్తిజాగూడ గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయగా, గురువారం మండల పరిధిలోని మేడిపల్లి, ఎతుబార్పల్లి, మొయినాబాద్లో అక్రమ నిర్మాణాలు కూల్చి వేశారు.
ప్రహారీలతో పాటు ఇండ్ల నిర్మాణ గోడలను కూడ కూల్చారు. డీఎల్పీవో శ్రీకాంత్రెడ్డి ఆదేశాల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే తప్పకుండ కూల్చి వేస్తామని అధికారులు హెచ్చరించారు.