సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైనది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసి త్వ రలోనే పనులను చేపడుతామని హెచ్ఎండీఏ వెల్లడించింది. గురువారం వం దల ఏండ్ల నాటి చరిత్ర కలిగిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువును ఆధునీకరించడంతోపాటు టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ను కోరారు.
నీటితో కళకళలాడుతున్న చెరు వు ఫొటోలను ట్వీట్ చేసి టూరిజం శాఖ దృష్టి పెడితే అద్భుతమైన వీకెండ్ టూరిజానికి కేంద్రంగా మారుతుందని, రిసార్టుతోపాటు బోటింగ్, పారాసైలింగ్ ఈ వెంట్లకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ పెద్దచెరువు సుందరీకరణకు తగు చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించా రు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా… ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా పెద్దచెరువు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆకట్టుకుంటున్న లోయపల్లి జలపాతం
ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఉన్న లోయపల్లి జలపాతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఓఆర్ఆర్ మీదుగా నాగార్జునసాగర్కు వెళ్లే మార్గం లో ఆదిబట్ల సమీపంలో ఉన్న లోయపల్లి జలపాతం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రదేశమని, చుట్టూ పరుచుకున్న గ్రీనరీ, కొండ ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని నెటిజన్లు తెలిపారు. వీకెండ్లోలోయపల్లి జలపాతాన్ని వీక్షించేందుకు స్థానికులు తరలివెళ్తుంటారని వివరించారు. కాగా పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధితోపాటు, పర్యాటక రంగాన్ని మరింత ప్రో త్సహించినట్లుగా అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.