చేవెళ్ల రూరల్, నవంబర్ 3 : చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామ రూపురేఖలు మారాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వగ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. గ్రామ జనాభా 2,244 ఉండగా, ఓటర్లు 1,826 మంది ఉన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య కృషితో అభివృద్ధిలో కూకుంట్ల దూసుకెళ్తున్నది.
కౌకుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్
గ్రామాభివృద్ధి వివరాలు
ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి..
గ్రామాల్లో చేపడుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కౌకుంట్లతోపాటు మిగతా గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దదానికి అహర్నిశలు శ్రమిస్తున్నాం.
– సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్రం
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
ప్రభుత్వ సహకారంతో చేవెళ్ల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డి ప్రత్యేక చొరువతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కార్యాచరణ రూపొందించాం.
– కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
పారిశుధ్యానికి ప్రాధాన్యం..
పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. డ్రైనేజీ, రోడ్లను శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలోని సమస్యలు అన్ని పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– దేవేందర్, కౌకుంట్ల పంచాయతీ కార్యదర్శి
మంత్రి ప్రత్యేక శ్రద్ధతో గ్రామాభివృద్ధి..
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధ, నిరంతర పర్యవేక్షణతో కౌకుంట్ల గ్రామ అభివృద్ధి సాధ్యమైంది. మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా.
– గాయత్రీగోపాలకృష్ణ, కౌకుంట్ల సర్పంచ్