కొత్తూరు రూరల్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధితశాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి సమక్షంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరయ్యారు. ఎంపీపీ సమక్షంలో ఆయా శాఖల అధికారులు చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను చదివి వివరించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని అందులో భాగంగానే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
కరోనా కష్టకాలంలో సైతం గ్రామాల అభివృద్ధికి ఎక్కడ కూడా నిధుల కొరత లేకుండా గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కొవిడ్ను తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని అందులో భాగంగానే కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకాను వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్లాట్, భూమి ఓనర్షిప్ సర్టీఫికేట్ను లబ్ధిదారుడు పొందేందుకు పడే ఇబ్బందులను డీఎల్పీఓ సురేశ్బాబు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు డీఎల్పీఓ సమాధానం తెలియజేశారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సురేశ్బాబు, జడ్పీటీసీ శ్రీలత, వైస్ఎంపీపీ శోభ, ఆయా మండల శాఖ అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.