కొత్తూరు రూరల్ : ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా, గంజాయి అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కొత్తూరు ఇన్స్పెక్టర్ భూపాల్శ్రీధర్ అన్నారు. కొత్తూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో కిరాణ దుకాణలు, పాన్డబ్బాలలో పోలీస్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగానే దొండురాం నిషేధిత గుట్కా, తంబాకు, పొగాకు వంటి ఉత్పత్తులను అమ్మిసొమ్ము చేసుకోనుండటంతో కిరాణ దుకాణంలో నాలుగు సంచుల్లో రూ. 30వేల విలువ చేసే గుట్కా, తంబాకు బయటపడింది.
దీంతో గుట్కాను స్వాధీనం చేసుకుని కిరాణ యాజమాని దొండురాం, అతని కొడుకు వెంకటేశ్పై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలను తప్పవని సీఐ తెలిపారు.