కొత్తూరు రూరల్ : గ్రామాలభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో ఆదివారం వడ్డె తులసమ్మ బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్గత మురుగు కాల్వ, సీసీ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్మే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను సాధించే దిశగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఇతర ప్రభుత్వాల హయాంలో మారుమూల గ్రామాలైనా గూడెంలు, తాండాలు వివక్షకు గరయ్యాయన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో సైతం అభివృద్ధి పరుగెడుతుందన్నారు. తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల నుంచి రూ. 5లక్షలు, అంతర్గత మురుగుకాల్వ నిర్మాణానికి గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 5లక్షలను వెచ్చించినట్లు సర్పంచ్ తులసమ్మబాలయ్య తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, గూడూరు, మక్తగూడ, మల్లాపూర్, మల్లాపూర్తండా సర్పంచ్లు సత్తయ్య, కాట్నరాజు, సాయిలు, రవినాయక్, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్ పాల్గొన్నారు.