సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్రకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే, ఏసీపీ
కొత్తూరు రూరల్ : దేశ రక్షణకు తమ ప్రాణాలను అర్పించిన అమరులకు జోహార్లు అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఆజాదికా అమృత్ మహాత్సవ్’ కార్యక్రమంలో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లు గత నెల 22న కన్యాకుమారి నుంచి రాజ్ఘాట్ వరకు సైకిల్ యాత్రను ప్రారంభించారు. బుధవారం సైకిల్యాత్ర కొత్తూరు మండల కేంద్రానికి చేరుకోవడంతో జవాన్లకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ పూలతో ఘనంగా స్వాగతం పలికారు. సైకిల్ యాత్రను నిర్వహిస్తున్న 20మంది జవాన్లకు సన్మానం చేసి అభినందించారు.
వారు దేశానికి, దేశ ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. పోరాటంలో మరణించిన అమరులకు నివాళ్లు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో 58వ బెటాలియన్ కమాండెంట్ విద్యాధర్, టీం కెప్టెన్ రమేశ్, కొత్తూరు రూరల్, నందిగామ సీఐలు సత్యనారాయణ, రామయ్య, కొత్తూరు, నందిగామ ఎస్ఐలు సయీద్, ధనుంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యదేవేందర్ యాదవ్, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, కౌన్సిలర్లు, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, మాజీ ఎంపీటీసీ దేవేందర్యాదవ్, నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.