కొత్తూరు : పట్టణీకరణతో చెట్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇంతకు ముందు కేవలం నగరాల్లోనే వెంచర్లను ఏర్పాటు చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పల్లెల్లో కూడా వెంచర్ల ఏర్పాటు అధికమయ్యాయి. దీనివల్ల చెట్లను నరికీవేయడంతో అడవులు సంఖ్య తగ్గిపోతుంది. అంతేకాకుండా ఎక్కడ కూడా చెట్ల కన్పించని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నింటినీ గమనించిన సీఎం కేసీఆర్ ఊరికి ఒక పల్లె ప్రకృతివనం, మున్సిపాలిటీల్లో కూడా పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 19,472 పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఈ పల్లెప్రకృతి వనం ఏర్పాటు విజయవంతం కావడంతో మండలానికి ఒక బృహత్ ప్రకృతి వనానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి.
షాద్నగర్ నియోజకర్గంలో 5 బృహత్ వనాల ఏర్పాటు
షాద్నగర్ నియోజకర్గంలో మొత్తం 5 బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తూ రు మండలంలోని సిద్ధాపూర్లో 10 ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నందిగామ మండలంలోని చేగూర్లో 8 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. దీన్ని సీఎంవో సోమేశ్కుమార్ ఈ మధ్యనే ప్రారంభించారు. అలాగే ఫరూఖ్నగర్ మండలంలోని లపల్లిలో 10 ఎకరాల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టగా దర్గూడ మండలంలో 10 ఎకరాల్లో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొందుర్గు మండలంలో 10 ఎకరాలో బృహత్ వనాన్ని నిర్మిస్తున్నారు.