కొందుర్గు : గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం కొందుర్గు మండలంలోని చిన్న ఎల్కిచర్ల, పర్వతాపూర్, రాంచంద్రపూర్, ముట్పూర్, టేకులపల్లి, విశ్వనాథ్పూర్, తంగెళ్లపల్లి, వెంకిర్యాల, ఆగిర్యాల, తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక నూతన పథకాలు ప్రవేశ పెట్టి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.
గత ప్రభుత్వాల హయంలో గ్రామాలు దుర్గందబరితంగ ఉండేవని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రోజు చెత్త సేకరణ చేయడం వలన ఎక్కడ కూడా దుర్గందం ఉండడం లేదని తెలిపారు. మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటికి నీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. మిషన్ కాకతీయ వల్ల ప్రతి గ్రామంలో గల చెరువులను అభివృద్ధి చేసి నీరు ఎక్కువగా నిలిచే విధంగా చేసినట్లు తెలిపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటి పట్టం ఎక్కువగ పెరిగినట్లు తెలిపారు. రైతులు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిక
కొందుర్గు మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పార్టీ చేపడుతన్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎదిర రాగమ్మ, వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, పీఎసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, సర్పంచ్లు నర్సింహారెడ్డి, పవిత్రాదేవి, సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, నాయకులు రాంచంద్రయ్య, బందులాల్, నర్సింలు పాల్గొన్నారు.