కొడంగల్ : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన ఖాలీలను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేపట్టడం జరుగుతుందని రీజినల్ కో-ఆర్డినేటర్ టీటీడబ్ల్యూఆర్ఈ సంస్థ ప్రాంతీయ సమన్వయ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థుల తల్లిదండ్రులు రాజేంద్రనగర్, స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో 14వ తేదీ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 7382931496ను సంప్రదించాలని కోరారు.