కొడంగల్ : సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ అయ్యప్ప, ఎస్సై సౌమ్యనాయక్తో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పార్టీల పరంగా, కుల, మతాల పరంగా ఎవరైనా వ్యక్తిగతంగా షోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టిన, ఉపన్యాసాలు చేసిన, వీడియో, ఆడియో మెసెజ్లు పెట్టిన కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇటీవల కొందరి వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు.