కొడంగల్ : వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు కొడంగల్ విచ్చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ల ఆధ్వర్యంలో గొల్ల, కురుమ యాదవులు ఘనంగా సన్మానించారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గొల్ల కురుమ యాదవులు కల్వకుర్తి ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. తొలిసారిగా కొడంగల్ విచ్చేసినందుకు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్మానించినట్లు గొల్ల కురుమ యాదవ సంఘం సభ్యులు తెలిపారు.
కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్ కుమార్, కౌన్సిలర్ మధుసూధన్ యాదవ్తో పాటు చాంద్పాషా, గోడల రాంరెడ్డి, నెహ్రూనాయక్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.