కొడంగల్, నవంబర్ 29 : భద్రాచలంలో జరుగుతున్న గురుకులాల సొసైటీ ఆటలపోటీల్లో కొడంగల్ వాసి డిస్కస్త్రో పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. భద్రాచలంలో గురుకులాలకు సంబంధించి మొత్తంగా 7 సొసైటీలు కాగా.. ప్రతి సొసైటీ నుంచి ఇద్దరు పాల్గొన్నారు. ఇందులోభాగంగా మంగళవారం జరిగిన డిస్కస్త్రో పోటీల్లో వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని హస్నాబాద్ గ్రామానికి సాయికిరణ్ ప్రతిభను కనబరిచి గోల్డ్మెడల్ను అందుకున్నాడు.
సాయికిరణ్ ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గతంలో నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించాడు. ప్రతీసారి క్రీడల్లో విజయకేతనం ఎగురవేసి జిల్లాతో పాటు నియోజకవర్గం, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు సాధించిపెడుతున్న విద్యార్థికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితోపాటు పలువురు అభినందనలు తెలిపారు.