కేశంపేట : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మోత్కుపల్లి నర్సింహ కుటుంబానికి శుక్రవారం ప్రమాదబీమా ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, కార్యకర్తల బాగోగులను పార్టీ చూసుకుంటుందన్నారు. అల్వాలలో పార్టీకి ఎంతో సేవ చేసిన నర్సింహ మృతి చెందడం తీరని లోటన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న నర్సింహకు ప్రమాదంలో మృతి చెందడం వల్ల అతని కుటుంబానికి రూ. 2లక్షల బీమా డబ్బులు వచ్చాయని తెలిపారు.
బీమా చెక్కును అందుకున్న నర్సింహ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఉప సర్పంచ్ దామోదర్రెడ్డి, మండల కో-ఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, కృష్ణయ్య, మల్లేష్యాదవ్ పాల్గొన్నారు.