కేశంపేట : కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట శ్రీలక్ష్మీవేంకటేశ్వస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గురువారం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో హోమం, ప్రత్యేక పూజల అనంతరం దేవతామూర్తులను ఎమ్మెల్యే దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ తాండ్ర విశాల, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్, టీఆర్ఎస్ నాయకులు మురళీయాదవ్, సురేష్యాదవ్, వెంకన్నయాదవ్, శేఖర్యాదవ్లతో పాటు భక్తులు పాల్గొన్నారు.