దోమ, డిసెంబర్ 24 : కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు తల్లీబిడ్డకు ఆరోగ్య భద్రతనిస్తాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను జడ్పీటీసీ రాందాస్నాయక్తో కలిసి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి గర్భిణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లీబిడ్డలకు మంచి ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్ను అందించి ఆరోగ్య భద్రతను కల్పించడంతో పాటుగా ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని కొనియాడారు.
అనంతరం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఎర్రగోవిద్ తండాలో గురులోకమసంద్ ప్రభు 13వ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, ఎంపీపీ సత్యమ్మ, రైతు బంధు మండల కోఆర్డినేటర్ రాజు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ హరికృష్ణ, వైద్యాధికారి మాధురి, సీహెచ్వో చంద్రప్రకాశ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గర్భిణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.