షాబాద్/చేవెళ్ల టౌన్, ఏప్రిల్ 25 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎంపీతో పాటు ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా చేవెళ్లలో ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహిళలు బోనాలతో స్వాగతం పలుకగా, భారీ ర్యాలీగా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం సవతి తల్లి ప్రేమను చూసిస్తోందని మండిపడ్డారు. తాను ఎంతో శ్రమించి బీజాపూర్ హైవేకు 72 శాతం భూసేకరణ పూర్తి చేశామన్నారు. చేవెళ్లలో డిగ్రీ కాలేజ్, స్టేడియం త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో రూ.5,180 కోట్లతో ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వికారాబాద్ జిల్లాలోని పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరు నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల నియోజకవర్గానికి కలిపి మొత్తం 5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. జీవో 111 ఎత్తివేసి ఈ ప్రాంత రైతులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అమిత్షా వచ్చి కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు రూ.30వేల కోట్లు ఇస్తే, ఇప్పుడు రూ.120 కోట్లు తెలంగాణకు ఇస్తున్నామని చెప్పారని, 2021-22 సంవత్సరంలో రూ.32వేల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత చేవెళ్ల నియోజకవర్గం ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో రూ.50కోట్లతో చెరువులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రైతుబీమా ద్వారా 1064 మందికి రూ.53కోట్లు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి రూ.60కోట్లతో నూతన కలెక్టరేట్ భవనాలు నిర్మాణం చేపట్టారని చెప్పారు.
శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.52కోట్లు నిధులు అందించినట్లు తెలిపారు. ఆర్అండ్బీ రోడ్లకు రూ.586 కోట్లు ఇచ్చారని, పంచాయతీరాజ్ రోడ్లకు రూ.310 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్, బీఆర్ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, ఆయా మండలాల ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, గునుగుర్తి నక్షత్రం, కాలె భవానీ, గోవర్ధన్రెడ్డి, కోట్ల ప్రశాంతిరెడ్డి, జడ్పీటీసీలు మర్పల్లి మాలతీ, పట్నం అవినాశ్రెడ్డి, కాలె జయమ్మ, గోవిందమ్మ, కాలె శ్రీకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, మాజీ జడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు డాక్టర్ ప్రశాంత్గౌడ్, పాపారావు, నర్సింగ్రావు, బీఆర్ఎస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, మహేందర్రెడ్డి, నాగిరెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా, పీఏసీఎస్ చైర్మన్లు పోలీసు రాంరెడ్డి, చల్లా శేఖర్రెడ్డి, శశిధర్రెడ్డి, వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్లు బర్కల రాంరెడ్డి, మధుసూదన్రెడ్డి, నాగార్జునరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, మంగలి యాదగిరి, మాణిక్యరెడ్డి, గిరిధర్రెడ్డి, శివారెడ్డి, తోట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.