కడ్తాల్ : ఆత్మ రక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో, మాస్టర్ కేశవ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ముద్విన్, సాలార్పూర్ గ్రామాలకు చెందిన 30మంది విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కాంపీటేషన్ నిర్వహించారు. పోటీల్లో ఇద్దరు బ్రౌన్, 14మంది ఆరెంజ్, 12 మంది విద్యార్థులు ఎల్లో బెల్ట్ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు కేశవ్, సతీశ్, మహేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.