షాబాద్, ఫిబ్రవరి 17: దృష్టి లోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కా ర్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం జిల్లాలో 16,202 మందికి కంటి పరీక్షలు నిర్వహించిన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. కంటి పరీక్షల కోసం వృ ద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పరీక్షలు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను వైద్యసిబ్బంది ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. డీఎంహెచ్వోపాటు ఆయా డివిజన్ల వైద్యాధికారులు ప్రతిరోజూ కంటి వెలుగు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగ ర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 80 బృందా ల ద్వారా శుక్రవారం 16,202 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 1,827 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. 1,634 మంది కి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు.
వికారాబాద్ జిల్లాలో..
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లా లో కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం సం బురంగా సాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి వైద్యులు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, అద్దాలను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 5,790 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 885 మందికి రీడిం గ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 847 మంది కోసం ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు 105 గ్రా మాలు, 27 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా..
కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరంలా మారింది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టలేదు. గతంలో కంటి పరీక్షలు చేయించుకోవాలంటే పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఆ బాధ తప్పింది. వైద్యులు గ్రామాలకే వచ్చి ఉచితంగా పరీక్షలు చేసి, అద్దాలు, మందులను పంపిణీ చేస్తున్నారు. పేదల బాగుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
– ఎం.వెంకటేశ్, తంగడిపల్లి గ్రామం, చేవెళ్ల మండలం