షాబాద్, మార్చి 2 : చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో గురువారం 15,867 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,516 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,158 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట : నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి జిల్లాలో 5242 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 758 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 632 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 171 గ్రామాలు, 40 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది : ప్రవీణ్ బేగం, చేవెళ్ల
కంటి వెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ంది. గ్రామాల్లోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేస్తూ పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ప్రైవేటు దవాఖానల్లో చూపించు కోవాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది. పేదల కష్టాలను తెలుసుకున్న సీఎం సార్ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మా అదృష్ణం. సీఎం సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు.