షాబాద్, మే 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 10,528 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 478 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 484 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
500 గ్రామాలు, 90 వార్డుల్లో శిబిరాలు
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం 5102 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 560 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 658 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 500 గ్రామాలు, 90 వార్డుల్లో వైద్య శిబిరాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.