పరిగి, జనవరి 31: అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సంద ర్శిం చారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఎమ్మెల్యే కండ్లద్దాలు అందజేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. 18 ఏండ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగానే కండ్లద్దాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
వంద రోజుల వ్యవధిలోని అన్ని గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయ్యేలా కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధులు తమ గ్రామానికి కంటి వెలుగు బృందం వచ్చిన సమయంలో గ్రామంలోని అర్హులందరినీ తీసుకువచ్చి కంటి పరీక్షలు చేయిం చాలని ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణలో అమలు జరుగుతున్న కంటి వెలుగు తో పాటు పలు కార్యక్రమాలు, పథకాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని చెప్పా రు. ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీడీవో శేషగిరిశర్మ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, ఎంపీవో దయానంద్, డాక్టర్ నవ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.