శంకర్పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని 70మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అనేక మందిని ఆదకుంటున్నారని తెలిపారు. అందులో ముఖ్యంగా పేదింటి ఆడ పడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి రూ. లక్ష 116లను అందిస్తున్నారని కొనియాడారు. అలాగే రైతులకు రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వారికి ప్రతీ సంవత్సరం పంట లాగోడికై ఎకరాకు రూ. 10 వేలను అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పథకం దేశంలోని ఏ రాష్టంలో కూడా లేదన్నారు.
కాగా ప్రతి పక్షాలు సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించడం హేయమైన చర్య అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, తాసీల్దార్ సైదులు, ఎంపీడీవో వెంకన్న, ఎంఆర్ఐ విక్రమ్రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక కౌన్సిలర్లు, పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు.