జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణం గురువారం కనుల పండువగా జరిగింది. ఎంపీ రంజిత్రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో న్విహించిన కల్యాణాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొని పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగించారు. జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్ అంటూ ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీలు వసతులు కల్పించాయి.
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 30 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గురువారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలం తమ స్వగ్రామమైన ఎలిమినేడు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఆయన తనయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి కుటుంబసమేతంగా సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. మంచాల మండలం నోమలు గ్రామంలో కోదండరామచంద్రస్వామి కల్యాణాన్ని ఆలయ ధర్మకర్త హరికిషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో కల్యాణాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీల్లోని పలు గ్రామాల్లోని ప్రధాన దేవాలయాల్లో సీతారాముల మహోత్సవ వేడుకలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
షాబాద్: చేవెళ్ల నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని సీతారాముల కల్యాణం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగా వైభవంగా జరిగింది. సీతారాముల కల్యాణ వేడుకల్లో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి సతీమణి సాన్విరెడ్డి కుటుంబ సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సీతారాంపూర్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన కల్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.జై శ్రీరామ్…జై జై శ్రీరామ్ అంటూ గ్రామం మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు భోజనం చేసే క్రమంలో పెద్ద గాలి రావడంతో టెంటు కూలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని దవాఖానకు తరలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొత్త పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్ కటికే సందీప్, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, దేవాదాయశాఖ ఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
కడ్తాల్ : మండలంలో సీతారామచంద్రస్వామి వారి పరిణయ మహోత్సవం వైభవంగా జరిగింది. మైసిగండి గ్రామంలో కల్యాణోత్సవానికి ముందు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ వారు పంపించిన పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను మైసమ్మ ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవం అంరగంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లులోని శ్రీరామంజనేయ స్వామి ఆలయం, పట్టణ సమీపంలోని అంతిరింతుర గుట్టపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, అయ్యసాగరం క్షేత్రంలోని శ్రీరామాలయం తదితర ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండలంలోని వివిధ గ్రామాల్లో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ భక్తులకు అన్నదానం చేశారు.
షాద్నగర్టౌన్ : భక్తుల రాకతో ఆంజనేయస్వామి, హనుమాన్, శివాలయాలు, సీతారాముల దేవాలయలు భక్తులతో కిటకిటలాడాయి. కల్యాణాన్ని వైభంగా నిర్వహించారు. పట్టణంలోని అలవేలుమంగా పద్మావతీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన కల్యాణంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్రావు, ప్రతాప్రెడ్డి, బక్కని నర్సింహులు, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. అదేవిధంగా షాద్నగర్ మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్ట వీరాంజనేయస్వామి, సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివమారుతి గీతా అయ్యప్ప మందిరంలో సీతాదేవి, శ్రీరామచంద్రడి విగ్రహాలను అలంకరించారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యువకులు జై శ్రీరాం అంటూ వీధుల్లో తిరిగారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేశంపేట : వేములనర్వలో వైస్ ఎంపీపీ అనురాధ-పర్వత్రెడ్డి దంపతులు సీతారాములకు పట్టు వస్ర్తాలను సమర్పించారు. కార్యక్రమానికి హాజరైన వారికి అన్నదానం చేశారు. కేశంపేట, కొత్తపేట, తొమ్మిదిరేకుల, కొండారెడ్డిపల్లి, లేమామిడి తదితర గ్రామాల్లో కల్యాణోత్సవాన్ని ప్రజాప్రతినిధులు, ప్రజలు నిర్వహించారు.
కొత్తూరు : మున్సిపాలిటీ, మండలంలోని వివిధ గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎస్బీపల్లిలో జరిగిన వేడుకల్లో జడ్పీటీసీ శ్రీలత -సత్యనారాయణ పాల్గొన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలోని మారుతి హనుమాన్ ఆలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య- దేవేందర్యాదవ్ పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించకుంది.
చేవెళ్లటౌన్, మార్చి 30 : చేవెళ్లలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య పాల్గొన్నారు.తీర్థప్రసాదాలను స్వీకరించారు. వారిని గ్రామస్తులు సన్మానించారు. మండల వ్యాప్తంగా ఆలయాలను ముస్తాబు చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : సీతారాముల కల్యాణ మహోత్సం ఘనంగా జరిగింది. హనుమాన్ దేవాలయాలను ముస్తాబు చేశారు. మండల వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆయా గ్రామాల్లో కల్యాణలో సర్పంచ్ల దంపతులు పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లో ఊరేగించారు.
ఆదిబట్ల : మున్సిపాలిటీ పరిధిలోని ఆదిబట్ల, కొంగరకలాన్, బొంగుళూరు గ్రామాల్లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. కల్యాణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
యాచారం : శ్రీరామచంద్రుడు, సీతాదేవిలను పట్టువస్ర్తాలతో ముస్తాబు చేశారు. ప్రజాప్రతినిధులు, పురోహితులు, గ్రామ పెద్దలు, భక్తులు భక్తిపారవశ్యంతో రాములోరి కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. మొండిగౌరెల్లిలో కొలన్ బుచ్చిరెడ్డి కుటుంబీకులు మహోత్సవాన్ని నిర్వహించారు.
మంచాల :మండల వ్యాప్తంగా కల్యాణాన్నిఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు విష్ణువర్ధ్దన్రెడ్డి, నౌసు హరిప్రసాద్, మమత, శ్రీనివాస్రెడ్డి, జగన్రెడ్డి, ఎంపీటీసీలు రమేశ్, సదానందం, నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య మున్సిపాలిటీ పరిధి శ్రీరామ్నగర్ కాలనీలోని రామాలయంలో నిర్వహించిన వేడుకలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేసింది.
ముత్యాల తలంబ్రాల ను భక్తులకు సమర్పించిన భక్తులు
అబ్దుల్లాపూర్మెట్ : అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవాయిద్యాలతో కల్యాణం కనుల పండువగా జరిగింది. ఎంపీపీ బుర్ర రేఖ, సర్పంచ్ కిరణ్కుమార్గౌడ్ దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో కల్యాణాన్ని సర్పంచ్లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో నిర్వహించారు.
చేవెళ్ల రూరల్ : శ్రీరామ నవమి సందర్భంగా ఊరెళ్ల గ్రామంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ ప్రసాద్, జడ్పీటీసీ మాలతి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్లు కల్యాణంలో పాల్గొన్నారు.
వైభవంగా కల్యాణ మహోత్సవం
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దఅంబర్పేటలో నిర్వహించిన కల్యాణ మహోత్సవాల్లో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పసుల రాజేందర్, కుంట్లూరులో జరిగిన కార్యక్రమాల్లో కౌన్సిలర్ జోర్క గీత, తట్టిఅన్నారంలో దేవిడి గీతా వేణుగోపాల్రెడ్డి, మర్రిపల్లిలో కౌన్సిలర్ పాశం అర్చన, ఆర్కేనగర్లో కౌన్సిలర్ మండల కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ఆర్కేనగర్లో నిర్వహించిన కల్యాణంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శంకర్పల్లి : బుల్కపూరం వార్డులో జరిగిన కల్యాణానికి ఎమ్మెల్యే యాదయ్య హాజరయ్యారు. రామాలయంలో చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్కుమార్ పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.