తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని దేవకి గార్డెన్స్లో డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 39 మందికి కల్యాణలక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని, పద్నాలుగేండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ తయారు చేయడానికి ఆయన అహర్నిషలు శ్రమిస్తున్నారని తెలిపారు.
అన్నదాతల కోసం 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారని, సబ్బండ వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. తెలంగాణలో 70ఏండ్లలో జరుగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడున్నరేండ్లలో చేసి చూపించారన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లల్లో కేఎల్ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు సంపూర్ణ మద్ధతును ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ రహమాన్, సర్పంచులు లలిత, రమేశ్, చంద్రయ్య, ఈశ్వర్, మాజీ జడ్పీటీసీ నర్సింహ, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ రాజేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేకర్రెడ్డి, రాంపూర్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీశైలంయాదవ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల చెక్కు అందజేత..
తలకొండపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కాలె నర్సింహ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడంతో పార్టీ చేసిన ఇన్సురెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరయ్యయి. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పరామర్శించి మృతుడి భార్య లక్ష్మీదేవి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటూ కంటికి రెప్పాలా కాపాడుకుంటుందన్నారు. పార్టీ పటిష్టం కోసం కార్యకర్తలు పనిచేయాలని కోరారు. అనంతరం వెల్జాల గ్రామంలో ముదిరాజ్ సంఘం భవణ నిర్మాణానికి స్థానిక ముదిరాజ్ కులస్తులతో కలిసి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, యాదయ్య, బాలకిష్టయ్య, జంగయ్య, దస్తగిర్ తదితరులు పాల్గొన్నారు.