షాబాద్,అక్టోబర్ 26 : కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన్నట్లు చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నల్లానీరు అందించి ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ, డిప్యూటీ తాసిల్దార్ క్రాంతికుమార్, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, కార్యదర్శి శ్రీరాంరెడ్డి, యూత్ అధ్యక్షుడు పీసరి సతీశ్రెడ్డి, ఉపాధ్యాక్షుడు కారు చెన్నయ్య, తదితరులున్నారు.