కడ్తాల్ : నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామం నుంచి పుల్లేరుబోడు తండా వరకు రూ. 5లక్షలతో చేపట్టిన మట్టి రోడ్డు మరమ్మతు పనులను సర్పంచ్ శంకర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని తెలిపారు.
గిరిజనుల చిరకాల స్వప్నమైన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సమైక్య పాలనలో తండాలు అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకే ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు.
ధ్యాన మహాసభలను విజయవంతం చేయాలి..
మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్లో ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా ధ్యాన మహాసభలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం పిరమిడ్ ట్రస్టు సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మహేశ్వర మహా పిరమిడ్ను సందర్శించారు. 11 రోజుల పాటు నిర్వహించే ధ్యాన మహాసభలకు వచ్చే ధ్యానులకు ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు విజయభాస్కర్రెడ్డి, సాంబశివరావు, మాధవి, జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, శంకర్, హరిచంద్నాయక్, కృష్ణయ్యయాదవ్, ఉప సర్పంచ్ అనిల్యాదవ్, నాయకులు రాజాగౌడ్, కుమార్గౌడ్, సేవ్యానాయక్, శ్రీరాములు, శ్రీనునాయక్, మల్లయ్య, శేఖర్యాదవ్, జాన్యానాయక్, మహేశ్, రమేశ్ పాల్గొన్నారు.