కడ్తాల్ : సమాజంలో ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయంలో, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ భగవంతుడి పట్ల నమ్మకం, విశ్వాసాలతోనే భక్తి భావాలు ముక్తి మార్గలుగా నిలుస్తాయని తెలిపారు. ప్రజలలో భక్తి భావాలు పెంపొందడం వల్ల సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంటుదని పేర్కొన్నారు. నిత్యం భగవంతుడిని స్మరించుకుంటే ప్రతి ఒక్కరి జీవనం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందన్నారు. అంతకు ముందు ఆలయంలో ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, చండూరధారణ, హన్మాన్చాలీసా పఠనం, సాముహిక సత్యనారయణ వ్రతాలు, హోమాలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ఆవరణలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, స్రవంతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకురాలు లీలమ్మ, పారిశ్రామికవేత్త లక్ష్మారెడ్డి, జడ్పీటీసీలు దశరథ్నాయక్, అనురాధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గిరియాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్లు శంకర్, కృష్ణయ్యయాదవ్, తులసీరాంనాయక్, యాదయ్య, నర్సింహా, శ్రీను, ఉప సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్ పాల్గొన్నారు.