కడ్తాల్ : మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బుధవారం ఆలయంలో గంధవలి ఉత్సవం, నిత్యనిధి, హోమం, బలిహరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏఎంసీ డైరెక్టర్ నర్సింహాగౌడ్ ఆధ్వర్యంలో వెల్దండ, కడ్తాల్, మక్తమాదారం, రావిచేడ్ గ్రామాలకు చెందిన భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సులోచన వారికి నగదును అందజేసి శాలువలతో సన్మానించారు.
అనంతరం గ్రామస్తులు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులగుండా తేరును లాగారు. గోవిందా నామస్మరణతో గ్రామమంతా మార్మోగింది. కార్యక్రమంలో సర్పంచ్ సులోచన, ఎంపీటీసీ మంజుల, ఉప సర్పంచ్ గణేశ్, నాయకులు సాయిలు, చంద్రమౌళి, శ్రీనివాస్గౌడ్, నర్సింహా, కృష్ణయ్య, రమేశ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.