కడ్తాల్ : మండల కేంద్రంలోని ఫార్చ్యూన్ బట్టర్ఫై సీనియర్ సెకండరీ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించిన పరీక్షకు, మొత్తం 780మంది విద్యార్థులకుగానూ 739మంది హాజరు కాగా 41మంది పరీక్షకు గైర్హాజరైనట్లు పరీక్ష కో-ఆర్డినేటర్ సంజీవ్నాంపల్లి, పరీక్ష కేంద్రం సూపరింటెం డెంట్ రంగారావు తెలిపారు. ఉదయం 10నుంచే పరీక్ష కేంద్రానికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రు లు రావడంతో పరీక్ష కేంద్రం పరిసరాలన్ని సందడిగా మారాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా పరీక్ష కేంద్రం వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద ఎస్సై హరిశంకర్గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.