కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి నేటి నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఏడు రోజులపాటు నిర్వహించే జాతర నిర్వహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరను పురస్కరించుకుని ఆలయానికి నిర్వాహకులు రంగులు వేయడంతో పాటు రకరకాల పూలు, మామిడి తోరణాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే మైసమ్మ ఆలయ సమీపంలోని శివాలయ, రామాలయాల వద్ద ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన్నట్లు ఆలయ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత తెలిపారు.