కడ్తాల్ : ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చని, ధాన్యంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ది పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ అన్నారు. ఆదివారం మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహా పిరిమిడ్లో పిరమిడ్ కేంద్రం పునఃప్రారంభత్సోవం పాటు, కార్తీక వనసమారాధన, పత్రీజీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్, సుభాశ్ పత్రీజీ, స్వర్ణమాల పత్రీజీ, పిరమిడ్ ట్రస్టు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుభాశ్ పత్రీజీ మాట్లాడుతూ నిత్యం ధాన్య సాధనతో ఆనందమయమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు.
శ్వాస మీద ధ్యాసే ధ్యానమని, ధ్యానంతో జ్ఞానం పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రపంచాన్ని శాఖహార జగత్గా మార్చడానికి ధ్యానులందరూ కృషి చేయలన్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ మహేశ్వర మహా పిరమిడ్తో ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రజలకు ధ్యానం అందించడంతో పాటు శాఖాహార సమాజ నిర్మాణానికి పత్రీజీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. మహేశ్వర మహా పిరమిడ్లో వచ్చే డిసెంబర్ నెలలో నిర్వహించనున్న ధ్యాన మహా సభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలువురు ధ్యానులు రచించిన అధ్యాత్మిక, ధ్యాన పుస్తకాలను పత్రీజీతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచులు లక్ష్మినర్సింహారెడ్డి, శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, ఎంపీటీసీ గోపాల్, శ్రీనివాస్ రెడ్డి, లాయక్ అలీ, నర్సింహ, నారాయణ, నరేశ్గౌడ్, పిరమిడ్ ట్రస్టు సభ్యులు విజయ భాస్కర్రెడ్డి, సాంబశివరావు, మారం శ్రీనివాస్, హనుమంతురాజు, రాంబాబు, మాధవి, నిర్మల, శ్రీరాంగోపాల్, జయశ్రీ, కృష్ణ, లక్ష్మీ, మదన్మోహన్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.