కడ్తాల్ : గ్రామాలు, తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు మండలంలోని కోనాపూర్ గ్రామం నుంచి కడ్తాల్ మండలంలోని మరిపల్లి గ్రామం మీదుగా ఏక్వాయిపల్లి గ్రామం వరకు రూ. 10లక్షలతో చేపట్టనున్న మట్టి రోడ్డు పనులకు సంబంధించిన ప్రొసిడింగ్ను, సోమవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మరిపల్లి గ్రామ సర్పంచ్ భాగ్యమ్మకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు.
కడ్తాల్ మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాల ఏర్పాటు త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. అనంతరం మట్టి రోడ్డు మరమ్మతు పనులకు నిధులు విడుదల చేసిన ఎమ్మెల్యేకి ఆయా గ్రామాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, కడ్తాల్, ఆమనగల్లు రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్లు వీరయ్య, నారాయణ, ఎంపీటీసీ గోపాల్, నాయకులు జంగయ్యగౌడ్, శ్రీనునాయక్ పాల్గొన్నారు.